ADB: అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని భీంపూర్ బీజేపీ మండల అధ్యక్షుడు అంకం అశోక్ డిమాండ్ చేశారు. రాష్ట్ర పిలుపులో భాగంగా అసెంబ్లీ ముట్టడికి బయలుదేరిన నాయకులను పోలీసులు ముందస్తు అరెస్టు చేయడం సమంజసం కాదన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చేంతవరకు ప్రభుత్వంపై పోరాటం కొనసాగిస్తామని హెచ్చరించారు.