ADB: పర్యావరణ హిత ఇంధన వనరులను ప్రోత్సహించేందుకు ‘పీఎం సూర్య ఘర్’ (రూఫ్ టాప్ సోలార్) ‘పీఎం కుసుమ్’ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని కలెక్టర్ రాజర్షి షా కోరారు. రూఫ్ టాప్ సోలార్ ఏర్పాటుకు ప్రభుత్వం దాదాపు రూ. 78,000 వరకు సబ్సిడీ అందిస్తోందని తెలిపారు. దీనిని బ్యాంకర్లు తమ లోన్ పోర్ట్ ఫోలియోలో ముఖ్యమైన భాగంగా చేర్చుకోవాలని పేర్కొన్నారు.