KNR: చొప్పదండి, ఆర్నకొండ సింగిల్ విండో కేంద్రాల్లో జీలుగు విత్తనాలు, పచ్చిరొట్ట ఎరువులు సిద్ధంగా ఉన్నాయని వ్యవసాయ అధికారి మమత తెలిపారు. రైతులు ఆధార్, పట్టాదారు పాసుబుక్ జిరాక్స్లతో వెళ్లి విత్తనాలు పొందవచ్చన్నారు. 30 కేజీల జీలుగ సంచి సుమారు మూడు ఎకరాల వరకు సరిపోతుందని, ఒక్క సంచి ధర రూ.2452.50గా ఉందని పేర్కొన్నారు.