GDWL: గర్భాశయ క్యాన్సర్ నివారణకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టిందని గద్వాల అడిషనల్ కలెక్టర్ నర్సింగరావు, DMHO సంధ్యా కిరణ్మయి తెలిపారు. మహిళా దినోత్సవం సందర్భంగా జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో 14 ఏళ్ల బాలికలకు హెచ్పీవీ టీకా కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆడపిల్లలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కాగా, జిల్లాలో 7,103 మంది 14 ఏళ్ల బాలికలను గుర్తించారు.