KMM: కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి పరిపాలన అంశాలపై సమీక్ష నిర్వహించి, ఈ నెల 27న జరిగే ‘దిశ’ సమావేశానికి అధికారులు పూర్తి సమాచారంతో హాజరుకావాలని ఆదేశించారు. సత్తుపల్లిలో అటవీ ఉత్పత్తుల మార్ట్ నిర్మాణానికి రూ. 10 లక్షల ప్రతిపాదనలు సిద్ధం చేయాలని, డబుల్ బెడ్రూమ్ ఇళ్లు, భూసేకరణ కేసులు, భూ భారతి దరఖాస్తులపై త్వరితగతిన నివేదికలు సమర్పించాలని సూచించారు.