ఢిల్లీ ప్రభుత్వం ఈవీలపై మూడేళ్ల పాటు సబ్సిడీ అందించనుంది. టూ వీలర్లపై మొదటి ఏడాది రూ.30 వేలు, ఈ-ఆటోలపై రూ.50 వేల వరకు, గూడ్స్ వాహనాలపై రూ.లక్ష వరకు నగదు ప్రోత్సాహకం లభిస్తుంది. ఈ సబ్సిడీ మొత్తం ప్రతి ఏడాది క్రమంగా తగ్గుతూ వస్తుంది. దీనికి తోడు పాత పెట్రోల్, డీజిల్ వాహనాలను తుక్కుగా మార్చి కొత్త ఈవీని కొంటే కార్లపై అదనంగా రూ.లక్ష వరకు భారీ రాయితీని ప్రభుత్వం కల్పించింది.