ADB: ఉట్నూరు ప్రభుత్వ గిరిజన మహిళా గురుకుల డిగ్రీ కళాశాల ప్రవేశాల కరపత్రాలను ఐటీడీఏ పీవో యువరాజ్ మర్మట్ సోమవారం ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ.. గురుకులాల్లో ఉచిత వసతితో కూడిన నాణ్యమైన విద్య అందుతుందని తెలిపారు. ఇంటర్ పూర్తి చేసిన గిరిజన బాలికలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ శ్రీవాణి, అధ్యాపకులు పాల్గొన్నారు.