WNP: మదనాపురం మండలంలోని జడ్పీ హైస్కూల్లో జాతీయ సైన్స్ దినోత్సవాన్ని వినూత్నంగా నిర్వహించారు. విజ్ఞానం పుస్తకాలకే పరిమితం కాదని చాటుతూ కళాకారుడు విద్యార్థుల ముందే కుమ్మరి చక్రంపై మట్టి పాత్రలు తయారు చేసి చూపించారు. మట్టిని కుండలుగా మార్చే విధానం విద్యార్థులను ఆకట్టుకుంది. సైన్స్ మన దైనందిన జీవితంలో భాగమని హెచ్ఎం మహేందర్ గౌడ్ తెలిపారు.