WGL: చెన్నారావుపేట పోలీస్ స్టేషన్ వద్ద ఏసీపీ వాహనాన్ని అడ్డుకున్న ఘటనలో పలువురిపై కేసులు నమోదు చేసినట్లు ఎస్సై రాజేష్ రెడ్డి శుక్రవారం తెలిపారు. జల్లి గ్రామానికి చెందిన వారిపై ఎస్సీ, ఎస్టీ కేసులు నమోదు చేయడంతో వారి బంధువులు, గ్రామస్థులు నిర్వహించిన నిరసనలో భాగంగా ఏసీపీ వాహనాన్ని అడ్డుకున్నమాజీ ఎంపీపీ అశోక్, సర్పంచ్ సుధాకర్ తదితరులపై కేసునమోదు చేశారు.