కామారెడ్డి: బిక్కనూర్ మండలం జంగంపల్లి శివారులో శనివారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. కామారెడ్డి నుంచి బిక్కనూర్కు వస్తున్న ఆటో, బైక్ ఢీకొన్నాయి. స్థానికుల వివరాలు.. ఈ ప్రమాదంలో ఆటో డ్రైవర్, అందులో ప్రయాణిస్తున్న మరో ఇద్దరికి గాయాలైనట్లు స్థానికులు తెలిపారు. వెంటనే వారిని కామారెడ్డి ఏరియా ఆసుపత్రికి తరలించినట్లు పేర్కొన్నారు.