BDK: మణుగూరు మండలం రైల్వే స్టేషన్ సమీపంలోని న్యూ పద్మగూడెం గ్రామానికి చెందిన పద్దం ప్రసాద్ ఇటీవల మృతి చెందిన విషయం తెలుసుకొని, పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ఇవాళ వారి నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులకు ధైర్యం చెబుతూ, తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. పద్దం ప్రసాద్ మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు.