WNP: శ్రీరంగాపురం మండల కేంద్రంలో శ్రీదేవి, భూదేవి సమేతంగా వెలిసిన శ్రీరంగనాథ స్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా 4వ తేదీన స్వామి వారి ప్రధాన ఘట్టమైన రథోత్సవం కార్యక్రమం ఉంటుందని ఆలయ అర్చకులు, కమిటీ సభ్యులు తెలిపారు. స్వామివారి రథోత్సవ వేడుకలు చూసేందుకు ఉమ్మడి జిల్లా నలుమూలల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తారని తెలిపారు.