KMR: భిక్కనూర్ మండలం అంతంపల్లి నర్సరీని సోమవారం కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ సందర్శించారు. నర్సరీలో పెంచుతున్న మొక్కల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా మొక్కల సంరక్షణ బాధ్య తను ప్రతి ఒక్కరూ తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ వెంట డీఎల్పీఓ శ్రీనివాస్, ఎంపీడీవో రాజ్ కిరణ్ రెడ్డి, ఎమ్మార్వో సునీత ఉన్నారు.