KMM: వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్ మంగళవారం సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కను మర్యాదపూర్వకంగా కలిశారు. ఎమ్మెల్యే నియోజకవర్గంలోని సమస్యల వారీగా వివరించారు. అలాగే అభివృద్ధి నిధులు మంజూరు చేయాలని కోరారు. సానుకూలంగా స్పందించిన వారు అభివృద్ధికి కావలసిన ప్రణాళిక రూపొందించుకొని త్వరితగతంగా నిధులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు.