NZB: మాజీ స్పీకర్ దుద్దిళ్ల శ్రీపాదరావు జయంతి వేడుకలను సోమవారం కలెక్టరేట్లో నిర్వహించారు. అధికారికంగా నిర్వహించిన జయంతి వేడుకల్లో అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ శ్రీపాదరావు చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఇంఛార్జ్ అదనపు కలెక్టర్ (ఎల్బీ), మున్సిపల్ కమిషనర్ దిలీప్ కుమార్, DRDO సాయ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.