MBNR: చిన్నచింతకుంట మండలంలోని కురుమూర్తి స్వామి వారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. నేడు అమావాస్య, రేపు ఉగాది పండుగ కావడంతో తెల్లవారుజాము నుంచే భక్తుల రద్దీ పెరిగింది. గోవింద నామస్మరణతో కురుమూర్తి గిరులు మారుమోగుతున్నాయి. రేపు కూడా భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుందని, అందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నామని ఆలయ కమిటీ వారు తెలిపారు.