MULG: టీడీపీ ఆవిర్భావం తర్వాతే ప్రజల్లో రాజకీయ చైతన్యం పెరిగిందని, సంక్షేమ పథకాలు సామాన్యుడికి చేరాయని మండల అధ్యక్షుడు ఎంఏ సలీం అన్నారు. ఆదివారం ములుగు పట్టణంలో టీడీపీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి పార్టీ జెండాను ఆవిష్కరించారు. సంక్షేమ పథకాలు సామాన్యులకు చేరాయని అన్నారు.