MNCL: తాండూర్ మండలంలో మోటార్లు, ట్రాన్స్ ఫార్మర్ల నుంచి విలువైన కాపర్ వైర్ చోరీ చేస్తున్న పదిమంది సభ్యుల ముఠాను పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి దొంగిలించిన కాపర్ స్వాధీనం చేసుకుని, వారిని రిమాండ్కు తరలించినట్లు సీఐ దేవయ్య తెలిపారు. ఈ ముఠాను పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన కానిస్టేబుళ్లను ఆయన ప్రత్యేకంగా అభినందించారు.