HNK: కేయూ మాజీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ లింగమూర్తి అనారోగ్యంతో మరణించగా భీమారం బ్యాంక్ కాలనీలోని వారి నివాసానికి వెళ్లి లింగమూర్తి పార్థివదేహానికి ఎమ్మెల్యే కడియం శ్రీహరి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.