HNK: కమలాపురం గ్రామపంచాయతీ కార్యాలయంలో శనివారం 60 మంది కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ లబ్ధిదారులకు వ్యవసాయ మార్కెట్ చైర్మన్ తౌటం ఝాన్సీ రవీందర్, సర్పంచ్ పబ్బు సతీష్ చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ.. ప్రజా ప్రభుత్వం నిరుపేద కుటుంబాలకు అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ శ్రీనివాస్, వార్డ్ మెంబర్లు తదితరులు ఉన్నారు.