NLG: అర్హులైన పేదలందరికీ రాజకీయాలకతీతంగా పారదర్శకంగా బడుగు బలహీన వర్గాల ప్రజలకు ప్రభుత్వ పథకాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి అన్నారు. స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వేములపల్లి, మాడుగులపల్లి మండలాలకు చెందిన 60 మంది లబ్ధిదారులకు రూ.60 లక్షలకు పైగా విలువ చేసే కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేసారు.