KKR: గతేడాది అక్టోబర్లో దౌల్తాపూర్ శివారులో జాదవ్ బన్సీలాల్ అనే వృద్ధుడిని మాయమాటలతో నమ్మించి, వెండి కడియం,బంగారు తాయత్తు అపహరించిన నిందితుడు భూమయ్యను బిచ్కుంద పోలీసులు అరెస్ట్ చేశారు.శనివారం కందర్పల్లి శివారులో తనిఖీలు చేస్తుండగా నిందితుడు పట్టుబడినట్లు సీఐ రవికుమార్ తెలిపారు. నిందితుడి నుంచి సొత్తు స్వాధీనం చేసుకొని రిమాండ్కు తరలించినట్లు చెప్పారు.