GDWL: పశువులకు వ్యాధులు సోకిన తర్వాత బాధపడటం కంటే ముందుగానే టీకాలు వేయించి వాటిని కాపాడుకోవాలి అని పెద్దపల్లి గ్రామ సర్పంచ్ అల్వాల శిరీష అన్నారు. సోమవారం మల్దకల్ మండలం పెద్దపల్లి గ్రామంలో ఉచిత గాలికుంటు వ్యాధి నివారణ టీకా శిబిరాన్ని ఆమె ప్రారంభించారు. పశువైద్యాధికారిణి డాక్టర్ ఉష మాట్లాడుతూ.. నోటి నుండి చొంగ కారడం, గిట్టల మధ్య పుండ్లు రావడం ఈ వ్యాధి లక్షణాలన్నారు.