SDPT: సిద్దిపేట ఐటీ టవర్లోని టాస్క్ కేంద్రంలో నిరుద్యోగ యువతకు ‘ట్రైనింగ్ కమ్ ప్లేస్మెంట్’ అవకాశం కల్పిస్తున్నట్లు మేనేజర్ నరేందర్ గౌడ్ తెలిపారు. ఇన్ఫోసిస్, డీట్, టాస్క్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ శిక్షణ ఉంటుంది. 2023-2026 మధ్య బీటెక్, డిగ్రీ పూర్తి చేసిన వారు అర్హులు. గురువారం సాయంత్రం లోగా ఉచితంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని, కేవలం మొదటి 200 మందికి అవకాశమున్నట్లు పేర్కొన్నారు.