BHPL: కాలేశ్వరంలోని కాళేశ్వర ముక్తేశ్వర స్వామి ఆలయంలో మార్చి 3న చంద్రగ్రహణం సందర్భంగా ద్వారబంధనం చేయనున్నట్లు ఆలయ EO మహేష్ తెలిపారు. ఉదయం 6:30 గంటల నుంచి ఆలయం మూసివేసి, గ్రహణానంతరం మార్చి 4న సంప్రోక్షణ పూజలు నిర్వహిస్తారు. అనంతరం ఉదయం 7 గంటల నుంచి భక్తులకు దర్శనం కల్పిస్తారు. గ్రహణ సమయంలో ఎలాంటి పూజలు ఉండవని, భక్తులు గమనించాలని EO కోరారు.