CTR: పలమనేరు మాజీ ఎమ్మెల్యే టీసీ రాజన్ భౌతిక కాయానికి జిల్లా పరిషత్ ఛైర్మన్ శ్రీనివాసులు శనివారం నివాళులర్పించారు. ఆయన మృతికి సంతాపం వ్యక్తం చేశారు. స్వాతంత్య్ర సమరయోధుడిగా ఆయన సేవలు చిరస్మరణీయమని చెప్పారు. గొప్ప నాయకుడిని కోల్పోయామని వెల్లడించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించారు.