NDL: ఇజ్రాయెల్-అమెరికా-ఇరాన్ యుద్ధ ప్రభావంతో కోడిగుడ్ల ఎగుమతులు నిలిచిపోవడంతో ధరలు భారీగా పడిపోయాయి. గత వారం జిల్లాలో ఒక్క గుడ్డు రూ.6.50కు పైగా ఉండగా, ప్రస్తుతం రూ.4.50కు పడిపోయిందని వ్యాపారులు తెలిపారు. ఈ పరిణామం జిల్లాలోని పౌల్ట్రీ పరిశ్రమపై తీవ్ర ప్రభావం చూపుతుందని నిర్వాహకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.