ADB: రైతులు తమ పండించిన పంటలను నేరుగా ప్రభుత్వ మార్కెట్ కొనుగోలు కేంద్రాలలో విక్రయించాలని ఎమ్మెల్యే అనిల్ జాదవ్ సూచించారు. తాంసి మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో శనగ కొనుగోలు కేంద్రాన్ని స్థానికులతో కలిసి శనివారం ప్రారంభించారు. రైతులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. దళారులను నమ్మి రైతులు మోసపోవద్దని MLA కోరారు.