AP: TDP ఆలయాలను అత్యంత ఆధునాతన ఆధ్యాత్మిక కేంద్రాలుగా తీర్చిదిద్దాలని అధికారులకు సీఎం చంద్రబాబు సూచించారు. తిరుమలలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. భక్తులు క్యూలైన్లలోకి ప్రవేశించినప్పటి నుంచి తిరుగు ప్రయాణం వరకు వారికి అందుతున్న సౌకర్యాలను కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా పర్యవేక్షించాలని ఆదేశించారు.