KNR: హుజూరాబాద్ పట్టణంలో ఈద్గా వద్ద రంజాన్ ప్రార్థనలు ఘనంగా నిర్వహించారు. వేకువజాము నుంచే ముస్లింలు భారీగా తరలివచ్చి ప్రత్యేక నమాజ్ చేశారు. నెల రోజుల ఉపవాస దీక్ష అనంతరం చిన్న పెద్ద తేడా లేకుండా ఒకరిని ఒకరు ఆలింగనం చేసుకొని రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్ పర్సన్ సుహాసిని, కౌన్సిలర్లు, తదితరులు పాల్గొన్నారు.