NTR: విజయవాడ ఇంద్రకీలాద్రిపై శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానం అభివృద్ధి పనులపై దేవాదాయ శాఖ కమిషనర్ రామచంద్ర మోహన్ శనివారం సమీక్ష నిర్వహించారు. చీఫ్ ఇంజనీర్ జి.వి.ఆర్. శేఖర్తో కలిసి ఆలయ ప్రాంగణంలో జరుగుతున్న నిర్మాణ పనులను పరిశీలించారు. పనుల నాణ్యతలో రాజీ పడొద్దని అధికారులను ఆదేశించారు.