E.G: రాజమండ్రి అర్బన్, రూరల్ పరిధిలో శనివారం ముస్లింలు భక్తి శ్రద్ధలతో రంజాన్ పర్వదిన వేడుకలు ఘనంగా జరుపుకొన్నారు. ఈ సందర్భంగా పలు మసీదుల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ మేరకు పండగ విశిష్టతను మత గురువులు వివరించారు. ఒకరికొకరు రంజాన్ శుభాకాంక్షలు తెలుపుకొన్నారు. కాగా సంప్రదాయ దుస్తులను ధరించి చిన్నారులు సందడి చేశారు.