AP: వ్యవసాయం చేసే చాలామంది రైతులకు ఆదాయం రావట్లేదని కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. ఒకే పంట కాకుండా ఎక్కువ పంటలు వేయాలని సూచించారు. మార్కెట్ డిమాండ్పై అవగాహన పెంచుకున్నాక పంటలు వేయాలని విజ్ఙప్తి చేశారు. రైతు ఉత్పత్తి సంఘాలుగా ఏర్పడితే లబ్ధి జరుగుతుందని తెలిపారు. మిద్దె తోటలకు బడ్జెట్ కేటాయింపుపైనా ప్రభుత్వంతో మాట్లాడతానని హామీ ఇచ్చారు.