HNK: పవిత్ర రంజాన్ పండుగ సందర్భంగా ఈద్-ఉల్-ఫితర్ ప్రార్థనలు సురక్షితంగా, సామరస్యంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని WGL CP సన్ ప్రీత్ సింగ్ అధికారులకు ఆదేశించారు. శనివారం HNKలోని బొక్కలగడ్డ, పోతానగర్ ఈద్గాలను CP సందర్శించారు. ప్రార్థనలకు తరలివచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు.