TG: ‘మాది శ్రమ ఫలితం.. మీది కేవలం శిలాఫలకం’ అంటూ మాజీమంత్రి హరీష్ రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డారు. నర్మెట్టలో మలేషియన్ టెక్నాలజీతో ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీని BRS ప్రభుత్వమే తెచ్చిందని గుర్తు చేశారు. కాళేశ్వరం నీళ్లు రావడం వల్లే ఆయిల్ ఫామ్ సాగు పెరిగిందని, నాడు ఈ ప్రాజెక్టులను అడ్డుకోవాలని చూసిన సీఎం రేవంత్, నేడు తాము చేసిన పనులకు రిబ్బన్లు కట్ చేస్తున్నారని విమర్శించారు.