AP: తిరుమల పిండిమర ప్రాంతంలో ఏర్పాటు చేసిన ఫుడ్ సేఫ్టీ ల్యాబ్ను సీఎం చంద్రబాబు ప్రారంభించారు. ఇక్కడ నీరు, ఆహార పదార్థాలు, ముడి సరకుల నాణ్యతను ల్యాబ్లో పరీక్షించనున్నారు. 12 వేల చదరపు అడుగుల్లో రెండంతస్తుల్లో వాటర్ అండ్ ఫుడ్ అనాలసిస్ లేబరేటరీ నిర్మించారు. రూ. 20 కోట్లతో అత్యంత ఆధునిక యంత్రాలతో కూడిన లేబరేటరీని ఏర్పాటు చేశారు.