VSP: జీవీఎంసీ పరిధిలోని ఆస్తిపన్ను చెల్లింపుదారులకు కమిషనర్ కేతన్ గార్గ్ తీపి కబురు చెప్పారు. మార్చి 31లోగా బకాయిలు చెల్లిస్తే వడ్డీపై 50% రాయితీ వస్తుందని ప్రకటించారు. ఇంటి పన్ను, ఖాళీ జాగా పన్ను బకాయిలపై ఈ మినహాయింపు వర్తిస్తుందన్నారు. సెలవు రోజుల్లో కూడా ఉదయం 8 నుంచి రాత్రి 8 గంటల వరకు కౌంటర్లు తెరిచి ఉంటాయని పేర్కొన్నారు.