TG: రైతు రుణమాఫీ చేస్తామని దేవుళ్లపై ఒట్టు పెట్టిన CM రేవంత్, నేటికీ ఆ హామీని నెరవేర్చలేదని మాజీమంత్రి హరీష్ రావు విమర్శించారు. సిద్ధిపేట నియోజకవర్గంలో 22,819 మంది రైతులకు ఇంకా 300 కోట్ల రూపాయల బకాయిలు ఉన్నాయని వెల్లడించారు. కేవలం 48% మందికే రుణమాఫీ అయిందని, మిగిలిన వారి పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. రైతులను నమ్మించి వంచించడం కాంగ్రెస్ మార్క్ రాజకీయం అని ఆయన ధ్వజమెత్తారు.