KRNL: ఆస్పరి మండలం కైరుప్పలలో ఉగాది సందర్భంగా నిర్వహించిన సాంప్రదాయ పిడకల ఆట ప్రశాంతంగా ముగిసిందని పత్తికొండ డీఎస్పీ వెంకటరామయ్య ఇవాళ పేర్కొన్నారు. వేడుకల్లో ఎవరికి గాయాలు కాలేదని వివరించారు. జిల్లా ఎస్పీ ఆదేశాలతో ముందస్తుగా కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేసి కార్యక్రమం సజావుగా జరిగేలా పోలీసులు చర్యలు తీసుకునరని వెల్లడించారు.