BDK: కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోల్ ధరలు తగ్గించాలని సీఐటీయూ దమ్మపేట మండల కమిటీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ మేరకు జిల్లా ఉపాధ్యక్షులు పిట్టిల అర్జున్ మాట్లాడుతూ.. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం వంటగ్యాస్ ధరలను పెంచి ప్రజలపై ఆర్ధిక భారం మోపి, ఇప్పుడు ప్రీమియం పెట్రోల్ ధరలను పెంచి దేశ ప్రజలపై మోయలేని ఆర్థిక భారాలు మోపుతుందన్నారు.