W.G: తాడేపల్లిగూడెంలోని పాతూరు మసీదు సమీపంలోని ఖబరిస్తాన్ (స్మశాన వాటిక) అభివృద్ధికి రూ.2 లక్షలు ఇస్తానని ఫిబ్రవరి 13న జరిగిన ముస్లింల ఆత్మీయ సమావేశంలో నియోజకవర్గ వైసీపీ ఇంఛార్జ్ వడ్డి రఘురామ్ నాయుడు హామీ ఇచ్చారు. శనివారం రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని పెద్ద మసీదు కమిటీకి ఆ నగదు అందచేశారు. అనంతరం వారికి రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.