TPT: తిరుమల పర్యటనలో ఎన్నడూ లేనివిధంగా సీఎం చంద్రబాబు సరికొత్తగా కనిపించారు. శ్రీవారి దర్శనం తర్వాత అన్నదానం కేంద్రానికి చేరుకుని భక్తులకు ఆయనే వడ్డించారు. తర్వాత ఆయన అక్కడే భోజనం చేశారు. తర్వాత బయటకు వచ్చి ప్రజలతో మాట్లాడారు. ఓ చిన్నారిని ఎత్తుకుని లాలించారు. చంద్రబాబు సరికొత్తగా కనిపించడంతో ఆయన అభిమానులు సంతోషం వ్యక్తం చేశారు.