NRPT: మరికల్ మండల కేంద్రంలోని సరస్వతి దేవి దేవాలయంలో శుక్రవారం రాత్రి వైభవంగా కుంకుమార్చన నిర్వహించారు. అర్చకులు శివప్రసాద్ మంత్రోచ్ఛారణలతో కుంకుమార్చన నిర్వహించారు. పసుపు కుంకుమలతో మహిళలు కలకాలం వర్ధిల్లాలని, సుమాంగలీగా ఉండాలని ప్రతి శుక్రవారం కుంకుమార్చన నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలను పంపిణీ చేశారు.