JGL: రాయికల్ పట్టణంలోని బస్తీ దవాఖానకు రాష్ట్రంలో ప్రథమ బహుమతి లభించింది. హైదరాబాద్లో గురువారం నిర్వహించిన ‘ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమంలో మంత్రి దామోదర రాజనర్సింహ చేతుల మీదుగా డాక్టర్ మొహమ్మద్ షబ్బీర్, నర్సింగ్ ఆఫీసర్ వసంత ప్రశంసా పత్రాన్ని అందుకున్నారు. పేద ప్రజలందరూ బస్తీ దవాఖాన సేవలను సద్వినియోగం చేసుకోవాలని డాక్టర్ షబ్బీర్ కోరారు.