SRD: ఝరాసంగం మండలం బర్దీపూర్ గ్రామంలో తాగునీటి పైప్లాన్ మరమ్మతు పనులను సర్పంచ్ రాజు ఆదివారం పర్యవేక్షించారు. వేసవి దృష్ట్యా గ్రామస్థులకు తాగునీటి ఎద్దడి కలగకుండా ముందస్తుగా ఈ చర్యలు చేపట్టినట్లు ఆయన తెలిపారు. ప్రజలకు మెరుగైన తాగునీటి సరఫరా అందించడమే తమ లక్ష్యమని, నీటి సమస్య తలెత్తకుండా నిరంతరం కృషి చేస్తామని ఈ సందర్భంగా సర్పంచ్ స్పష్టం చేశారు.