MBNR: హైదరాబాద్ ఇందిరా ధర్నా చౌక్ వద్ద ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్ ఉద్యోగుల బకాయిల కోసం తెలంగాణ బీజేపీ ఆధ్వర్యంలో చేపట్టిన నిరాహార మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ మద్దతు తెలిపారు. రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగుల పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడినట్లు అయ్యిందన్నారు. అధికారంలోకి రావడానికి అనేక మాయమాటలు చెప్పి ప్రజలను వంచించిందన్నారు.