సూర్యాపేట పట్టణంలోని సుందరయ్య నగర్ శివారు వ్యవసాయ భూమిలో గురువారం ఓ వ్యక్తి (35) వేపచెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించారు. మృతుడు నీలం రంగు గడుల చొక్కా, ఎరుపు రంగు లోయర్ ధరించి ఉన్నాడు. మృతుని వివరాలు తెలిసిన వారు సూర్యాపేట పట్టణ పోలీసులను సంప్రదించాలని సీఐ వెంకట్ కోరారు.