JN: టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ హనుమాండ్ల ఝాన్సీ రెడ్డి ఇవాళ మంత్రి సీతక్కను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ మేరకు ఆమె పాలకుర్తి నియోజకవర్గంలో శ్రీనిధి సంస్థలో జరిగిన అవకతవకలపై సమగ్ర విచారణ జరిపించి బాధితులకు న్యాయం చేయాలని కోరారు. ఈ మేరకు మంత్రికి వినతి పత్రం అందజేశారు. ఈ అంశంపై ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందని ఝాన్సీ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు.