జగిత్యాల జిల్లాలో మంజూరైన ఇందిరమ్మ ఇండ్లను 100 శాతం గ్రౌండింగ్ చేయాలని అదనపు కలెక్టర్ బి.రాజ గౌడ్ అధికారులను ఆదేశించారు. సమీకృత జిల్లా కలెక్టరేట్లో గురువారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. పెండింగ్లో ఉన్న 10,860 ఇండ్లకు ఏప్రిల్ 30లోగా మార్క్ ఔట్ పూర్తి చేసి పనులు ప్రారంభించాలని తెలిపారు.