NRPT: మేరా యువభారత్ ఆధ్వర్యంలో మక్తల్ మండలంలోని మంథన్ గోడ్ గ్రామంలో బుధవారం యువ మండల వికాస్ అభ్యాస్ నిర్వహించారు. జిల్లా కోఆర్డినేటర్ అనిల్ గౌడ్, నేతాజీ వచన సంఘం అధ్యక్షుడు చెన్నకేశవులు మాట్లాడారు. గ్రామ యువ కమిటీలను మేరా యువభారత్తో అనుసంధానం చేసి, యువతకు ప్రోత్సాహం, ఉద్యోగ, క్రీడా అవకాశాలు కల్పించాలని పేర్కొన్నారు.